అమ్మాయి మేజర్ అని ఆధారాలు సమర్పిస్తామంటున్న భగీరథ్ వర్గాలు
హైదరాబాద్ ముచ్చట్లు:
కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించిన కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, నేడు ఆయన విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో నిజం తమవైపే ఉందని భగీరథ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
“అమ్మాయి స్వయంగా తాను మేజర్ అని చెప్పింది.. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి” అంటూ భగీరథ్కు సన్నిహితులు చెబుతున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేసులో వచ్చిన ఆరోపణలకు చట్టపరంగా సమాధానం చెప్పేందుకు భగీరథ్ సిద్ధంగా ఉన్నారని, పూర్తి విచారణ తర్వాత నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఇటీవలే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా “నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు” అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై భగీరథ్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి విచారణ పూర్తికాకముందే తప్పుడు ప్రచారాలు చేయడం సరైంది కాదని, చట్టంపై విశ్వాసం ఉంచాలని కోరుతున్నారు.
ఇప్పటికే అమ్మాయి వయస్సుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, రికార్డులు తమ వద్ద ఉన్నాయని, అవన్నీ నేడు విచారణలో సమర్పించనున్నట్లు భగీరథ్ వర్గాలు వెల్లడించాయి.
నేడు జరిగే విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో రాజకీయ, న్యాయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Tags: “I have all the evidence”… Bandi Bhagirath appears for questioning today.