తాళాలు వేయకుండ వెళ్లిన వైనం
- పోలీస్ నిఘాలో వెల్లడి
పుంగనూరుముచ్చట్లు:
సచివాలయంలో అర్ధరాత్రి వరకు పనుల పేరుతో ఉండి , అదమరచి తాళాలు వేయకుండ వెళ్లారో….లేదా ….తెలియదు కానీ మండలంలోని ఉలవలదిన్నె సచివాలయానికి తాళాలు వేయకుండ ఉండటంతో అర్ధరాత్రి బీట్ పోలీసులు కనుగొని తాళాలు వేశారు. బుధవారం ఉదయం ఈ విషయం వెలుగుచూసింది. కాగా సచివాలయంలో ఒక కార్యదర్శితో పాటు ఒక స్నేహితుడు ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరు అర్ధరాత్రి వరకు అక్కడ ఏం చేశారన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. ఈ విషయమై ఎంపీడీవో అప్పాజిని వివరణ కోరగా సచివాలయానికి తాళాలు వేయకుండ వెళ్లిన మాట వాస్తవమేనని, దీనిపై విచారణ జరుపుతున్నామని, పొరపాట్లు జరిగిఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Tags: Late-night work at the Secretariat