పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని శాంతినగర్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టకపోవడంతో దోమలు ప్రభలి ప్రజలు ఆనారోగ్యం పాలౌతున్నారని గురువారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో చాలా రోజులుగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టలేదని, ఫిర్యాదు చేసిన సచివాలయ అధికారులు, పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవడం లేదని ఆప్రాంత వాసులు ఆరోపించారు. దీని కారణంగా దోమలు ప్రభలిపోయిందని తెలిపారు. తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
Tags: Sanitation is nowhere to be found in Shantinagar.