పుంగనూరుముచ్చట్లు:
శ్రీ శనేశ్వరస్వామివారి జయంతిని ఈనెల 16న భక్తి శ్రద్దలతో నిర్వహించనున్నారు. పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయం, రాగానిపల్లె రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయంలోను 15న ఉదయం నుంచి పూజలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. 16న స్వామివారికి తైలాభిషేకంతో పాటు నువ్వులదీపాలు వెలిగించి, మహాభిషేకము చేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని , స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.
Tags: Sri Shaneshwara Swamy Jayanti on the 16th.