అమరావతిముచ్చట్లు:
NEET 2026 పేపర్ లీకేజీ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసిన ఎన్టీయే(NTA), తాజాగా ఈనెల 22న తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా.. ఈ కేసు విచారణను కేంద్రం సీబీఐ (CBI)కి అప్పగించింది. ఇప్పటికే కీలక సూత్రధారులను అరెస్ట్ చేయగా.. మే 3న పరీక్ష రాసిన 22.7 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు మళ్ళీ పరీక్షకు హాజరుకావాల్సి ఉంది.
Tags: NEET Exam on the 22nd of this month?