అమరావతి ముచ్చట్లు:
ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరులో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబరులోగా ఎన్నికలు పూర్తిచేసి, కొత్త ఏడాది నాటికి నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. జూలైలో బీసీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఇప్పటికే 13,291 పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు సిద్ధమవ్వగా, పురపాలికల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags: Notification for Local Body Elections in AP in September!