తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం దిశగా సాగుతోంది. కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎం), ఐయూఎంఎల్ వంటి పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. బహిష్కృత ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ కూడా టీవీకేకు జై కొట్టారు. దీంతో ప్రభుత్వ బలం 121కి చేరి మెజారిటీ మార్కును దాటింది. అల్పాహార పథకం కొనసాగింపు, పరువు హత్యల పై ప్రత్యేక చట్టం తేవాలని మిత్రపక్షాలు డిమాండ్ చేశాయి.
Tags: Vijay’s Test of Strength… Majority Secured!