పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని ఆరడిగుంట వద్ద గల శ్రీ కాళహస్తి ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్ ఫ్యాక్టరీలో జీతాలు పెంచాలని స్థానిక కార్మికులు ఆందోళన చేశారు. మంగళవారం కార్మికులు మాట్లాడుతూ ఉత్తరాది ర్ఖా•లకు చెందిన కార్మికులకు రోజు రూ.718లు ఇస్తూ, స్థానికులకు రూ.450 లు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఆందోళన చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించి ఆందోళనను విరమింప చేశారు.
Tags: Concerns over wage increases in factories