మచిలీపట్నం ముచ్చట్లు:
పరాసుపేట సెంటర్ వద్ద స్కూళ్ల ఒంటిపూట బడులు ముగిసే సమయంలో అతివేగంగా వచ్చిన లారీ ముగ్గురు విద్యార్థినులను ఢీకొట్టీన పరిస్థితి…
అక్కడ ఉన్న స్థానికులు కేకలు వేయడంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది.
దీంతో పెద్ద ప్రమాదం నుంచి విద్యార్థినులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించి అక్కడ ట్రాఫిక్ పోలీసులు లేకపోవడమే కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీక్ టైమ్లో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు అంటున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
Tags: A major tragedy was narrowly averted in Machilipatnam on Wednesday.