ములకలచెరువు ముచ్చట్లు:
ములకలచెరువు మండలానికి చెందిన యువతి, సదుం మండలానికి చెందిన యువకుడు ప్రేమ వివాహం చేసుకుని పోలీసుల రక్షణ కోరుతూ శనివారం మదనపల్లె డీఎస్పీ పావనిని ఆశ్రయించారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతి తిరుపతిలో ఉద్యోగం చేస్తున్న సమయంలో యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారినట్లు తెలిపారు. పెద్దల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు వినతిపత్రం అందజేశారు.
Tags; Couple in Love Seeks Police Protection