అమరావతి ముచ్చట్లు:
ఏపీలో ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు EAPCET-2026 పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా 12-18 తేదీల్లో ఇంజినీరింగ్, 19-20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 3.55 లక్షల మంది విద్యార్థుల కోసం ఏపీ, హైదరాబాద్లలో 142 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు, తెలంగాణలో నేటి నుంచే ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని అధికారులు సూచించారు.
Tags; EAPCET-2026 exams in AP to begin on the 12th of this month.