పుంగనూరుముచ్చట్లు:
రైతులు మామడి, టమోటా పంటలపై వస్తున్న తామరపురుగు నివారణకు వేపనూనే లేదా ట్రేసర్మందు వినియోగించుకోవాలని ఉధ్యానపరిశోధనశాస్త్రవేత్త దత్తారెడ్డి తెలిపారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలోహెచ్వో వరప్రసాద్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మామిడిపండ్ల కవర్లను వినియోగించుకుని , పంటలు నష్టంకాకుండ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Tags: Neem oil should be used to control thrips.