తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు రాజకీయ యవనికపై పెను సంచలనం నమోదవుతోంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల కోటగా ఉన్న ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయ సమీకరణాలు తారుమారవుతున్నాయి.ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే, అధికార కూటమికి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వంటి అగ్రనేతలు తమ సొంత నియోజకవర్గాల్లోనే వెనుకంజలో ఉండటం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
ద్రవిడ కోటలో ప్రకంపనలు.. స్టాలిన్ కుటుంబానికే ఎదురుగాలి
తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన డీఎంకే ప్రస్తుతం ఆత్మరక్షణలో పడింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొళత్తూర్, అలాగే ఉదయనిధి స్టాలిన్ పోటీ చేస్తున్న చెపాక్-తిరువల్లిక్కేని నియోజకవర్గాల్లో ట్రెండ్స్ ఆ పార్టీకి ప్రతికూలంగా వచ్చాయి. అధికారంలో ఉండి, అన్ని వనరులు కలిగి ఉండి కూడా అగ్రనేతలు వెనుకబడటం అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం డీఎంకే కేవలం 60 కంటే తక్కువ స్థానాల్లోన.
Tags: Why is there such strong opposition against the father and son in Tamil Nadu?