తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడులోని తిరుప్పత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి శీనివాస సేతుపతి సంచలన విజయం సాధించారు. కేవలం ఒక్క ఓటు తేడాతో డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్పై ఆయన గెలుపొందారు. సేతుపతికి 83,375 ఓట్లు రాగా, పెరియకరుప్పన్ 83,374 ఓట్లు సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి తిరుమారన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ స్వల్ప మెజారిటీ విజయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Tags: Perhaps this is what luck is… He won by a single vote.