హైదరాబాద్ ముచ్చట్లు:
దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఇప్పటికే చేరుకున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు. చెవులకు ఉన్న కమ్మలు వంటి ఆభరణాలను తీసివేసి విద్యార్థినులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్తున్నారు.
Tags: NEET Exam to Begin Shortly… No Entry Even If Delayed by a Minute.