అమరావతిముచ్చట్లు:
నైరుతి రుతుపవనాలు ఈసారి నిర్ణీత సమయం కంటే ముందుగానే, మే 14-16 తేదీల మధ్య అండమాన్ దీవులను తాకే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీనివల్ల మే నెలలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పగలు, రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి, ఉక్కపోత వేధించనుంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Tags: The Southwest Monsoon is expected to reach the Andaman Islands between May 14 and 16.