May 2, 2026
Explore
రెడ్డి కోట సమీపంలోని బ్రిడ్జిపై నుంచి లోయలో పడ్డ గొర్రెల బొలెరో

రెడ్డి కోట సమీపంలోని బ్రిడ్జిపై నుంచి లోయలో పడ్డ గొర్రెల బొలెరో

May 2, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లె ముచ్చట్లు:

ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి మరో నలుగురికి తీవ్ర గాయాలు

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం, అంగళ్లు గొర్రెల సంత నుంచి గొర్రెలను కొని కలకడ మండలం, పాపిరెడ్డిగారిపల్లికి తరలిస్తున్న బొలెరో వాహణం తంబళ్లపల్లి మండలంలోని రెడ్డి కోట సమీపంలో ఉన్న బ్రిడ్జి పై నుంచి లోయలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని గుర్రంకొండ 108 సిబ్బంది బయ్యారెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డీలు హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Tags: A Bolero carrying sheep plunged into a valley from a bridge near Reddy Kota.