ఎన్టీఆర్ జిల్లా ముచ్చట్లు:
ప్రేమించి పెళ్లి చేసుకుంది.. పెళ్లి తర్వాత ఇంకొకరిని ఇష్టపడి.. భర్తను చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.
ఎన్టీఆర్ జిల్లాలో వివాహేతర సంబంధం దారుణ హత్యకు దారి తీసిన ఘటన సంచలనం రేపింది.
బాణావతు తండాకు చెందిన వడిత్య రాజేష్, అలేఖ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజుల తర్వాత అలేఖ్యకు కృష్ణసేన అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త రాజేష్ను హత్య చేయాలని కృష్ణసేన, అలేఖ్యలు పథకం రచించారు.
ఈ నెల 21న రాజేష్ను మద్యం తాగించి, ఐరన్ రాడ్తో కొట్టి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
అనంతరం మృతదేహాన్ని కారులో ఎన్ఎస్సీ కాలువలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు
మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ కేసుపై రాజేజ్ బంధువుల ఆందోళనలతో పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేశారు. మద్యం బాటిల్ హోలోగ్రామ్ ఆధారంగా కీలక ఆధారాలు లభించాయి.
చివరికి భర్త హత్య వెనుక భార్య అలేఖ్యతో పాటు ఆమె ప్రియుడు కృష్ణసేన సహా నలుగురు ఉన్నట్లు తేల్చి పోలీసులు అరెస్ట్ చేశారు.
Tags: Wife Kills Husband, Stages It as a Road Accident.