April 29, 2026
Explore
జర్నలిస్టు హత్యపై పల్నాడులో ఆగ్రహ జ్వాలలు…

జర్నలిస్టు హత్యపై పల్నాడులో ఆగ్రహ జ్వాలలు…

April 29, 2026 | Andhra Pradesh

కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా

పల్నాడు ముచ్చట్లు:

పల్నాడు జిల్లాలో జర్నలిస్టులపై దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నరసరావుపేట కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టి, చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసించారు.

ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ, హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో నిరసనకారులు జిల్లా కలెక్టర్, ఎస్పీకి వినతిపత్రాలు సమర్పించారు. సమస్యపై వెంటనే స్పందించి న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

Tags: Flames of outrage engulf Palnadu over journalist’s murder.