April 26, 2026
Explore
ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ యువకుడు

ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ యువకుడు

April 26, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మదనపల్లి మండలం చీకిలబైలుకు ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. చీకులపల్లి సమీపంలోని సుబ్బిరెడ్డిబావిలో సహచరులతో కలిసి ఓ యువకుడు ఈత ఆడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై మృతి చెందాడు. సహచరులు కేకలు పెట్టడంతో, స్థానికులు స్పందించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నిస్తూ ఉండగా అతను మృతి చెందాడు. వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Young Man Drowns While Swimming