అమరావతిముచ్చట్లు:
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో నిందితులకు జైలులోనే మరికొన్ని రోజులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
Tags: Bail Petitions of Accused in AP Liquor Case Dismissed