విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖపట్నంలో గూగుల్ డేటాసెంటర్ ఏర్పాటుతో సింహాచలం వరాహ
లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీ ఆదాయం సమకూరనుంది. అడవివరం, ముడసర్లోవ పరిధిలోని ఆలయానికి చెందిన 160 ఎకరాల భూమిని 11 ఏళ్ల పాటు ఏపీఐఐసీకి లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.26.45 కోట్ల రాబడి రానుంది. ఇప్పటివరకు కూరగాయల సాగు ద్వారా కేవలం లక్షల్లోనే వస్తున్న ఆదాయం, ఈ ఒప్పందంతో 11 ఏళ్లలో దాదాపు రూ.300 కోట్లకు చేరనుంది.
Tags: Google Data Center in Visakhapatnam: ₹300 Crore Revenue for Simhadri Appanna!