అమరావతిముచ్చట్లు:
పాము కాటు నుండి రైతులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్ మిత్ర ఛడీ’ అనే ఎలక్ట్రానిక్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది.
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించిన ఈ పరికరం.. 100 మీటర్ల దూరంలో ఉండే జీవుల కదలికలను గుర్తించి వైబ్రేషన్ ద్వారా రైతును హెచ్చరిస్తుంది.
ఇందులో సోలార్ టార్చ్లైట్ సౌకర్యం కూడా ఉంది.
చీకటి సమయంలో పొలాలకు వెళ్లే అన్నదాతలకు ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందని, ప్రాణనష్టాన్ని నివారించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
Tags: The ‘Kisan Mitra Chadi’ Electronic Device That Puts an End to Snakebites