April 22, 2026
Explore
ట్రాక్టర్ బోల్తా ఘటనలో మరో కార్మికుడు మృతి

ట్రాక్టర్ బోల్తా ఘటనలో మరో కార్మికుడు మృతి

April 22, 2026 | Andhra Pradesh

రైల్వే కోడూరు ముచ్చట్లు:

రైల్వే కోడూరు నియోజకవర్గం వెలగచర్ల గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్తున్న కార్మికులతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో మరో వ్యక్తి పగడాల పెంచలయ్య మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తిరుపతి మారుతీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

తరువాత ఆయన మృతదేహాన్ని తిరిగి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Tags:Another Worker Dies in Tractor Rollover Incident