చిన్నమండెం ముచ్చట్లు:
చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వగృహంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తమ లక్ష్యమని తెలిపారు. పలువురు తమ సమస్యలను వివరించగా, వాటి పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొని మంత్రిని సత్కరించారు.
Tags: Resolving Public Issues Is the Government’s Goal: Minister Ramprasad Reddy