బెంగళూరు ముచ్చట్లు:
బెంగళూరు శివారు అంజనానగర్లో ఓ యువతి తన ప్రియుడిని కిరోసిన్ పోసి సజీవదహనం చేసింది.
తుమకూరుకు చెందిన కిరణ్(27) ఓ మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తుండగా..,
అక్కడే పనిచేస్తున్న ప్రేమ అనే యువతితో ప్రేమలో పడ్డాడు.
కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, పెళ్లి చేసుకోడేమోనని అనుమానించిన ప్రేమ..,
మంగళవారం కిరణ్ను ఇంటికి పిలిచి లవ్ ప్రపోజ్ పేరుతో కళ్లకు గంతలు కట్టి..,
కుర్చీకి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించింది.
కిరణ్ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు.
నిందితురాలని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags:Lover ties up boyfriend’s hands and feet and burns him alive.