పుంగనూరు ముచ్చట్లు:
అతివేగంగా ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇరువురు గాయపడి ఆసుపత్రి పాలైన సంఘటన మంగళవారం పట్టణ సమీపంలోని గాంధిపురం వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం వీరప్పల్లెకి చెందిన శివకుమార్ (27) , కుదవపల్లెకి చెందిన ఆంజప్ప (47) లు తమ పనుల నిమిత్తం పుంగనూరు సమీపంలో వెళ్తుండగా అతివేగంగాఎదురెదురుగా రెండు వాహనాలు వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర రక్తగాయాలైంది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన ఇద్దరిని 108లో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇరువురు చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Two-wheeler Collision: Two Injured