April 21, 2026
Explore
తల–మొండెం వేరు… వినుకొండలో అనుమానాస్పద మృతి

తల–మొండెం వేరు… వినుకొండలో అనుమానాస్పద మృతి

April 21, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది.

మృతదేహం తల, మొండెం వేర్వేరుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మృతుడి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది రైలు ప్రమాదమా లేక హత్య కోణమా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టి ఆధారాలు సేకరిస్తున్నారు.

Tags: Head Severed from Torso… Suspicious Death in Vinukonda