తమినాడు ముచ్చట్లు:
గూగుల్ లాంటి కంపెనీలకు తమిళనాడు నుంచి వెళ్లిన సుందర్ పిచాయ్ నేతృత్వం వహిస్తున్నారు.
తమినాడు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి.
డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా బులెట్ స్పీడ్ అభివృద్ధి వస్తుంది.
డీఎంకే లాంటి రాజకీయ పార్టీల వల్ల అభివృద్ధి జరగటం లేదు.
అభివృద్ధి కావాలంటే ఎన్డీఏకి ఓటు వేయాల్సిందే.
దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయి.
గూగుల్, అర్సెలర్ మిట్టల్ లాంటి పెట్టుబడులు వస్తున్నాయి.
మేము ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం.
అభివృద్ధి కోసం పని చేస్తున్నాం.
తమిళనాడు అభివృద్ధి కోసం పని చేసే అవకాశం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలి.
మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం ద్వారా డీఎంకేకు ఏం కలిసి వచ్చింది…?
రాజకీయాల కోసం బిల్లులను అడ్డుకోవడం సరికాదు.
మహిళా, డిలిమిటేషన్ బిల్లులను గుడ్డిగా వ్యతిరేకించడం వల్ల మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకే నష్టం.
గతంలో తమిళనాడుకు ఓ ఘన చరిత్ర ఉంది కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి..?
ఇతర రాష్ట్రాలు తమిళనాడు నుంచి చాలా నేర్చుకున్నాయి.
అభివృద్ధి సాధిస్తేనే సంపద సృష్టి జరుగుతుంది సంక్షేమం సాధ్యం అవుతుంది.
ఒకే దేశంగా అన్ని రాష్ట్రాలూ కలిసి పని చేయాలి.
కావేరి నది నీటి కోసం కర్ణాటక , తమినాడుల మధ్య వివాదం నడుస్తుంది.
ఏపీలో కృష్ణా గోదావరి నదులు అనుసంధానం జరుగుతోంది.
త్వరలో గంగా కావేరిల నదుల అనుసంధానం జరిగితే అన్ని రాష్ట్రాలకు నీటి భద్రత లభిస్తుంది.
మాతృభాషను గౌరవించాలి… మాతృ భాషతోనే మన సంస్కృతిని కాపాడుకోగలం.
కానీ వివిధ భాషలు నేర్చుకోవడం వల్ల అభివృద్ధి సాధించగలం.
దేశాభివృద్ధి కోసం రాష్ట్రం కూడా ప్రగతి మార్గంలో నడవాలి
కేవలం ప్రధాని మోదీపై వ్యతిరేకతతో భాషాపరమైన బేధాలు తీసుకురావడం సరికాదు.
మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని ప్రధాన మంత్రి చెబుతున్నారు.
ఏపీలో గత ప్రభుత్వం బలవంతంగా ఇంగ్లిష్ అమలు చేయాలని చూస్తే.. కేంద్రమే అడ్డుకుంది.
భాష అనేది ఇప్పుడు ఓ సమస్య కాదు.
రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి పార్టీ పెట్టిన విజయ్ ఏ మేరకు రాణించగలడో ఇంకా చెప్పలేం.
Tags: The youth of Tamil Nadu need job and employment opportunities.