పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బజారువీధిలో వెలసియున్న శ్రీ ప్రసిద్ధ బసవేశ్వరస్వామి 893 వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి రాతి విగ్రహానికి విభూది, చందనం, ఆవుపాలు, పెరుగు, తేనే ,సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వెండి కవచంతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags: Sri Basaveshwara Swami Jayanti