అమరావతి ముచ్చట్లు:
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఇకపై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు ఇంప్రూవ్ మెంట్ రాసుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండగా.. ఇక పై సెకండ్ ఇంటర్ విద్యార్థులూ తమ మార్కుల్ని మెరుగుపరుచుకొనేందుకు ఈ ఛాన్స్ కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా వెల్లడించారు.
Tags: Good news for Intermediate students in AP.