April 18, 2026
Explore
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల తీరుపై మైనారిటీ మోర్చా ధ్వజం

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల తీరుపై మైనారిటీ మోర్చా ధ్వజం

April 18, 2026 | Andhra Pradesh

​పుంగనూరు ముచ్చట్లు:

​పుంగనూరు మండలం బయలుగాని పల్లి లో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) పట్ల విపక్షాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఈరోజు బయలుపల్లి నందు మైనారిటీ మోర్చా నాయకులు అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా అయూబ్ ఖాన్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే, రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు అడ్డంకులు సృష్టించడం దారుణమని విమర్శించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును ఆమోదింపజేసి మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలన్న నిర్ణయాన్ని అడ్డుకోవడం మహిళా లోకాన్ని అవమానించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

​ఈ నిరసనలో ప్రధాన అంశాలు:

​మహిళలకు రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
​విపక్షాలు తమ ద్వంద్వ వైఖరిని వీడాలి.
​మహిళా రిజర్వేషన్ బిల్లు విజయవంతం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది.
​ఈ కార్యక్రమంలో స్థానిక మైనారిటీ మోర్చా నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని విపక్షాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags: Minority Morcha Slams Opposition’s Stance on Blocking Women’s Reservation Bill in Legislatures