తిరుపతి ముచ్చట్లు:
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఏప్రిల్ 25వ తేదీన శ్రీ సీతమ్మవారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయం భక్తి పరవశంతో నిండిపోనుంది.ఈ సందర్భంగా 25వ తేదీ శనివారం సాయంత్రం 5.30 గంటల నుండి 7.30 గంటల వరకు పలు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కార్యక్రమాలు ఆలయ ప్రదక్షిణతో ప్రారంభమై, భగవత్ అనుగ్ఞ, విష్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి విశేష ఆరాధన, అమ్మవారికి వసంతిక పూజ, సహస్రనామార్చన భక్తిశ్రద్ధలతో సాగుతాయి.తదనంతరం నివేదన, మహా మంగళహారతి, వేదస్వస్తి, సాత్తుమొర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.ఈ పుణ్యదినాన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతమ్మవారి అనుగ్రహం, కృపాకటాక్షాలను పొందాలని టిటిడి ఆకాంక్షిస్తోంది.
Tags: Sri Seethamma’s Jayanthi Grand Celebrations in Ontimitta on April 25th.