April 15, 2026
Explore
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఢిల్లీ ముఖ్యమంత్రి

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఢిల్లీ ముఖ్యమంత్రి

April 15, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆమెకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును వివరించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్న ప్రెడిక్టివ్ అనలిటిక్స్ విధానాన్ని వివరించారు.

అలాగే లడ్డూ ప్రసాదం తయారీ, ట్రాఫిక్ నిర్వహణ, వసతి సదుపాయాల సమన్వయం వంటి అంశాల్లో ఈ సెంటర్ పనితీరును కూడా వివరించారు.

భక్తుల భద్రతకు టీటీడీ చేస్తున్న కృషిని ఢిల్లీ ముఖ్యమంత్రి అభినందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Tags:Delhi Chief Minister visits Integrated Command and Control Center.