July 26, 2026
Explore
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.

July 26, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు రమేశ్‌ కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.

‘గబ్బర్ సింగ్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేశ్‌, ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో చేరారు. ఈ విషయం తెలియగానే దర్శకుడు హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ టీం సభ్యులు ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు. అపోలో ఆసుపత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి రమేశ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

అనంతరం రమేశ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన భార్యకు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా సహాయం అందేలా చూస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. రమేశ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు సైతం తన వంతుగా రూ.2 లక్షల చెక్కును అందించి కుటుంబానికి భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులకు మెగా కుటుంబం అండగా నిలవడంపై సినీ వర్గాల నుంచి, ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Tags: Megastar Chiranjeevi has once again demonstrated his generosity.