పలమనేరు ముచ్చట్లు:
తమిళనాడు రాష్ట్రానికి చెందిన శేఖర్ అనే వ్యక్తిని రైస్ పుల్లింగ్ చేస్తామంటూ మోసం చేయడానికి ప్రయత్నించిన కృష్ణప్ప, మునిష్, విజయకుమార్, నాగరాజు, శంకర్ అనే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పంజాని ఎస్ఐ మారెప్ప నేతృత్వంలో నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు అధికారులు మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు.ఈ ఘటన క్రిష్ణగిరి జిల్లా, పెద్దపంజాణి పరిధిలోని రాయలసీమ రోడ్డులో ఉన్న ఓ ఆంజనేయ స్వామి గుడి సమీపంలో జరిగింది.
Tags: Four Accused Arrested in Rice Pulling Case