నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల నుండి గిద్దలూరు వెళ్ళు రోడ్డు మార్గంలోని దొరబావి వంతెన వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికుల కు స్వల్ప గాయాలయ్యాయి. వాహనాలు కిలోమీటర్ల దూరంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడo వల్లే ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Tags: RTC Bus Collides with Lorry