పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని నాగపాళెంలో వెలసియుండు శ్రీ కళ్యాణ కోదండరామస్వామి ఆలయాన్ని, ఆలయ ఆస్తులను దేవాదాయశాఖ పరిధిలోనికి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా దేవాదాయశాఖాధికారి విశ్వనాథ్ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక గ్రూపు టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి రమణ, దేవస్థాన సిబ్బంది కలసి ఆలయాన్ని , ఆలయ ఆస్తులను పరిశీలించారు. త్వరలోనే ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోనికి చేర్చుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు.
Tags; Measures to bring the Sri Kodandarama Temple under government control.