పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఉచిత కంటి వైద్యశిబిరాన్ని డాక్టర్ గ్రీష్మబిందు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు 208 మంది రోగులకు ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారికి ఏరియా ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహించి, తగిన చికిత్సలు చేస్తామని తెలిపారు. కంటి జబ్బులు కలిగిన వారు ఈఅవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags: Eye Care Camp at the Area Hospital