మదనపల్లి ముచ్చట్లు:
టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీనివాసరావు ఇంటిలోకి ఆదివారం దౌర్జన్యంగా ప్రవేశించి శాంతిభద్రతలకు భంగం కలిగించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ భాష డిమాండ్ చేశారు. బాధితుడు శ్రీనివాసరావుతో కలిసి ఆయన తాలూకా పోలీస్ స్టేషన్ను సందర్శించి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
Tags: Action should be taken against Madanpalli riot incident: MLA