రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఏసీలు చోరీకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కార్యాలయంలో ఉన్న రెండు ఏసీలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్లు సమాచారం. శనివారం ఉదయం కార్యాలయం తెరిచి చూడగా ఏసీలు కనిపించకపోవడంతో అధికారులు షాక్కు గురయ్యారు.ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించగా, పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: ACs Stolen from Rajampet Tahsildar Office