April 11, 2026
Explore
అక్షర యోధుడు జ్యోతిబా పూలేకు పోలీసుల నివాళులు

అక్షర యోధుడు జ్యోతిబా పూలేకు పోలీసుల నివాళులు

April 11, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

సామాజిక చీకట్లను తొలగిస్తూ విద్యా వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి కొనియాడారు.శనివారం మదనపల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా విద్య ద్వారా సమాజ మార్పు సాధ్యమని పూలే నిరూపించారని తెలిపారు. 1848లో బాలికల విద్యకు నాంది పలికారని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Police Pay Tributes to the ‘Warrior of Letters,’ Jyotiba Phule