చంద్రగిరి ముచ్చట్లు:
చంద్రగిరి–నర్సింగాపురం మధ్య రైలు పట్టాలపై ఆదివారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలంకు చెందిన షేక్ అస్లాం (20)గా గుర్తించారు.
ఈ ఘటనపై చిత్తూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Body of Youth from Sundupalli Found on Railway Tracks in Chandragiri