అమరావతి ముచ్చట్లు:
- దేశంలోని అన్ని పార్టీలది ఒక దారైతే వైకాపాది మరోదారి అని సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంపై సీఎం మాట్లాడారు. ‘‘వైకాపా నేతలు రాష్ట్ర ప్రజల చేత ఓట్లు వేయించుకుని.. రాష్ట్రానికి ద్రోహం చేశారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆ పార్టీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ బిల్లు ఆమోదం ప్రజారాజధానికి దక్కిన గౌరవం. అమరావతిని నాశనం చేయాలని వైకాపా చూస్తే తాము శాసనం చేశాం’’ అని అన్నారు.
Tags: “If anyone attempts to destroy Amaravati, we have enacted legislation,” said Chandrababu.