April 2, 2026
Explore
రాజా రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రూ.167 కోట్లు

రాజా రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రూ.167 కోట్లు

April 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ‘యశోద కృష్ణ’ ఆయిల్ పెయింటింగ్.. వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడై అరుదైన రికార్డు సృష్టించింది. సాఫ్రాన్ ఆర్ట్స్ నిర్వహించిన వేలంలో సీరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా దీనిని దక్కించుకున్నారు. తద్వారా ఎం.ఎఫ్. హుస్సేన్ (రూ.118 కోట్లు) రికార్డును అధిగమించి, అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా నిలిచింది. 1890లలో గీసిన ఈ అద్భుత చిత్రాన్ని సొంతం చేసుకోవడం తన కర్తవ్యమని పూనావాలా పేర్కొన్నారు.

Tags: Raja Ravi Varma painting fetches ₹167 crore at auction.