విశాఖపట్నం ముచ్చట్లు:
ఏపీకి 47,000 టన్నుల ఎల్పీజీ లోడుతో కూడిన భారీ నౌక ‘పైన్ గ్యాస్’ విశాఖ పోర్టుకు చేరుకుంది. ఒడిశాకు వెళ్లాల్సిన ఈ నౌకను తెలుగు రాష్ట్రాల అవసరాల దృష్ట్యా విశాఖకు మళ్లించారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న వంటగ్యాస్ కొరత తీరనుంది. గ్యాస్ సరఫరాకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Tags; Another Massive LPG Ship Arrives in Visakhapatnam