పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని నగరివీధిలో వెలసియున్న శ్రీ సోమేశ్వరస్వామి రథోత్సవాన్ని పట్టణంలో నిర్వహించారు. బుధవారం వార్షిక బ్రహ్మో త్సవాలలోభాగంగా ఆలయ అర్చకులు, కమిటి సభ్యులు కలసి స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి రథోత్సవం నిర్వహించి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హరహరమహాదేవ శంభోశంకర అంటు పరమేశ్వరుని ప్రార్థించారు. ఈ సందర్భంగా మంగళహారతులు వెలిగించి, టెంకాయలు కొట్టి మోక్కులు చెల్లించుకున్నారు.
Tags: Sri Someswara Swamy Chariot Festival