March 28, 2026
Explore
అధికారుల నిర్లక్షం పూలతోటల్లోకి నీరు

అధికారుల నిర్లక్షం పూలతోటల్లోకి నీరు

March 28, 2026 | Andhra Pradesh

లక్షల్లో నష్టం

పుంగనూరుముచ్చట్లు:

ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారుల నిర్లక్షంతో కౌలురైతు పొలంలో నాటికి పూలతోటల్లోకి హంద్రినీవా నీరు వదలడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. మండలంలోని గుడిసెబండకు చెందిన నాగరాజు చెండుమల్లెపూలతోట సాగు చేశాడు. ఇలా ఉండగా శనివారం అధికారులు హంద్రినీవా నీటిని చెరువుల్లోకి వదిలారు. కాలువలును సక్రమంగా నియంత్రించకపోవడంతో ఆనీరు వేగంగా వచ్చి పూలతోటలపైన, వరిపంటలపైన పడి పూలు కుల్లిపోయి లక్షల నష్టం వాటిల్లింది. తమకు నష్టపరిహారం అందించాలని రైతు నాగరాజుతో పాటు పలువురు కోరుతున్నాడు.

Tags: Officials’ Negligence: Water Enters Flower Gardens