రామసముద్రం ముచ్చట్లు:
రామసముద్రం కు చెందిన కొండపల్లి సురేష్ సీనియర్ జర్నలిస్ట్ అనారోగ్యంతో తిరుపతి సిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మొదట ఈనాడు పత్రిక విలేకరిగా మండల కేంద్రంలో, మదనపల్లి, ఈనాడు ఎడిషన్లో కార్ట్ నిస్టుగా చాలా ఏళ్లుగా పనిచేశాడు. తరువాత ఆంధ్రజ్యోతి పుంగనూరు, మదనపల్లి, చిత్తూరు కేంద్రంలో పనిచేశాడు. అనారోగ్యంతో స్విమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సురేష్ మృతి పై పలు జర్నలిస్టు సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


Tags: Senior journalist Ramasamudram Suresh passes away.