పుంగనూరు
పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద వెలసిన శ్రీ శనేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పంచామృతం, గోక్షిరంతో అభిషేకం చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారికి నువ్వులదీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటి వారు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags: Special prayers to Sri Saneswara Swamy